ముత్యాల లక్ష్మి గారికి, పసుపులేటి ధనలక్ష్మి గారికి అభినందనలు....           (23-Jun-2020)


నిన్న మధ్యాహ్నం ముత్యాల చంటి గారు – లక్ష్మి గార్ల కోడలు, పసుపులేటి బుల్లబ్బాయి గారు – ధనలక్ష్మి గార్ల కుమార్తె అయిన ‘జ్యోతి’ శ్రీమంతం కార్యక్రమం డా. రాజ్యలక్ష్మి గారి బజారులోని షాదీఖానాలో జరిగింది. ఈ కార్యక్రమానికి కార్యకర్తలందరినీ ఆహ్వానించినందుకు ధన్యవాదములు.

 

భోజనాల బల్లపై కాగితం వేసి అరిటాకులో భోజనం పెట్టారు. మంచినీళ్ళకు పేపర్ గ్లాసులే వాడారు. ఐస్ క్రీం తినడానికి చెక్క స్పూన్లే ఇచ్చారు. వేడుకలలో పర్యావరణ పరిరక్షణ కోసం మనం ఏమైతే చెప్తున్నామో అవన్నీ పాటించి ఆదర్శ కార్యకర్తలుగా నిలిచారు. స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమం తరఫున వారికి అభినందనలు.

 

-డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
06-07-2018