ఇటువంటి కార్యక్రమాలలో జరిగే భోజనాల వద్ద పర్యావరణహితంగా ఏమేమి చెయ్యవచ్చో స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమం తరఫున డా. పురుషోత్తం గారికి ముందే వివరించటం జరిగింది. దానికనుగుణంగా వారు –
1. ఫ్లెక్సీ పెట్టలేదు.
2. భోజనాల బల్లపై మామూలు కాగితమే వేశారు.
3. పంక్తి భోజనాలలో అరిటాకులలో వడ్డించారు.
4. బఫేలో మళ్ళీ మళ్ళీ వాడగలిగే ప్లాస్టిక్ ప్లేట్లపై అరిటాకు వేసి అందజేశారు.
ఇది స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమ ఫలితమే!
మంచినీళ్ళు మాత్రం ప్లాస్టిక్ బాటిల్స్ లో ఇచ్చారు. మనం ప్రతిపాదించిన వాటిలో జరగనిది ఇదొక్కటే. మార్పు మొత్తం ఒక్కసారే రాకపోవచ్చు.
స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమంలో శ్రమించిన ప్రతి ఒక్కరికి అభినందనలు. నిన్నటి కార్యక్రమానికి హాజరైన అందరికీ ధన్యవాదములు.
-డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
23-07-2018