స. వెం. రమేశ్ - ఒక నిత్య సంచారి.... (06-Sep-2022)
స. వెం. రమేశ్
- ఒక నిత్య సంచారి
మనందరం తప్పక తెలుసుకోవాల్సిన మనిషి.
తమిళనాడులో పుట్టిన తెలుగు వ్యక్తి. దాదాపు 15 సంవత్సరాల వయస్సు వరకు తెలుగు పెద్దగా రాదు.
తమిళనాడులో తెలుగు వారిని, తెలుగును అవమానించడం చూసి భరించలేక తెలుగు కోసం శాస్త్రీయంగా ఉద్యమిస్తున్న *‘పొరుగు తెలుగు వాడు’*.
మన దేశంలోనూ, ప్రపంచంలోనూ తెలుగువారు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకొని చెప్పడం, మరిచిపోయిన తెలుగు మాటలు గుర్తు చేయడం తన పనిగా పెట్టుకున్నాడు.
పాతిక పైగా సంవత్సరాల నాడు ప్రారంభమైన ఆతని ఈ ఉద్యమ ప్రస్థానం నేటికీ అదే స్ఫూర్తితో కొనసాగుతోంది.
ఈ వీడియో ప్రశాంతంగా చూడండి.www.youtube.com/watch
అందరూ చూడండి.
ఆసక్తి గల వారికి మరికొన్ని వీడియోలు పంపుతాను.
తెలుగు వారి కోసం అతను చేసే ఈ పరిశోధన మరెవ్వరూ చేయలేదు.
తెలుగును బ్రతికించాలనే ఒకే ఒక్క కారణం కోసమే పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితాన్ని గడుపుతున్న ధన్య జీవి ‘స. వెం.రమేశ్’.
- డా. దాసరి రామ కృష్ణ ప్రసాదు
06.09.2022.